తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకాన్ని మార్చి 17న అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు.

సుమారు రూ.6వేల కోట్లతో 5లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. మార్చి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 5వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన అనంతరం జూన్ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు చెక్కులు అందించనున్నారు.
దరఖాస్తు చేసేందుకు కావాల్సిన పత్రాలు ఇవే..
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- లబ్దిదారుడి ఫొటో
- పాన్కార్డు (ఆప్షనల్)
- కుల ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్యాంకు వివరాలు
- లోన్ దేనికోసం తీసుకుంటున్నారు
- లోన్ మొత్తం ఎంత?
పై వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం

Rajiv yuva vikasam apply: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే..